
* ఈసీపై మరో మారు రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరున్యూస్ డెస్క్: మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని రాహుల్ గాంధి సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ కోసం ఈసీ(EC) ఓట్లను దొంగిలించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘాన్ని ఎండగట్టారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని.. ఎగ్జిట్పోల్స్కు , ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉందని.. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను మాయం చేశారని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల తరువాత భారీగా పోలింగ్ నమోదయ్యిందన్నారు. మహారాష్ట్రలో 40 లక్షల రహస్య ఓటర్లను చేర్పించారని పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ డేటాను ఈసీ ఇవ్వడం లేదు
ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ డేటాను ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఈసీ వ్యవహరిస్తోందని అన్నారు. .. ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఐదు వేర్వేరు తేదీల్లో ఈసీ ఓట్లను దొంగిలించిందన్నారు. కర్నాటకలోని మహదేవ్పూర్లో కూడా ఓట్లను దొంగిలించారన్నారు. ఒకే ఓటరు పేరు నాలుగు పోలింగ్ బూత్(Poliing Booth)ల్లో చేర్పించారని.. 11 వేల మంది పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నట్టు చూపించారని.. మహదేవ్పూర్లో 11,965 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒకే ఓటరు నాలుగు రాష్ట్రాల్లో ఓటేశాడని.. ఒకే ఓటరుకు కర్నాటక, మహారాష్ట్ర, యూపీలో ఓటుహక్కు ఉందని.. తెలిపారు. మహదేవ్పూర్లో లక్షా 250 ఓట్లు దొంగిలించారు.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మహారాష్ట్ర ఎన్నికలపై అనుమానం
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. దేశంలో వస్తున్న ఎన్నికల ఫలితాలు అంచనాలను మించి ఉంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు. పరిశోధనలో తమ అనుమానాలు నిజమయ్యాయని రాహుల్ అన్నారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు
…………………………………