
* తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జర పైలం
* ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అప్పులతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలపై ఇంత కక్ష ఎందుకని, కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్కు ఇంత కోపమా అంటూ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ట్విటర్(ఎక్స్)వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘నిన్న గేటు ఎత్తుకెళ్లారు, నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు.. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా??. తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారు(CONGRESS GOVERNMENT)తో జెర పైలం. అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా? కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్ కు ఇంత కోపమా??సాగు నీళ్లిచ్చే సోయి లేదు.. పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు. కానీ.. రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా?. బీఆర్ఎస్ (BRS)ప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువాను.. ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా??. తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా?. ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా??
2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని సన్నాసులు ఇంత దారుణానికి ఒడిగడతారా??. రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి.. రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా??. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి.. మళ్లీ అప్పులపాలయ్యేలా చేసిన పాపం మీది కాదా కాదా!!.
ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటి?. మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి?. వ్యవసాయరంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి.. సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదు. సంఘటితంగా పోరాడుతది..! సీఎం(CM)కు బుద్ధి చెబుతది..!!’’ అంటూ ట్వీట్ చేశారు.
……………………………………………..