
ఆకేరున్యూస్, హన్మకొండ: తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి కానిస్టేబుల్ సస్పెండ్కు కారణమైన సాయి ప్రకాశ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్తో సహ ఐదుగురిని హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి ఒక కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఎయిర్ పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో..
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.ప్రస్తుతం ములుగు వెంటాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, చింతగట్టు,హన్మకొండ జిల్లా,2. డేవిలీ సాయి, గుంటూరు జిల్లా, ఆ.ప్ర, 3. ఆలోత్ అరుణ్కుమార్ ఆలియాస్ పండు, హన్మకొండ, 4.సబావత్ అఖిల్ నాయక్, హన్మకొండ, 5. రాజు, హన్మకొండ, 6.చింతం నిర్మల, వెంటాపురం (వాజేడు), ములుగు జిల్లాకు చేందిన వారీగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడిరచారు. ఈ నెల 15న రాత్రి 11 గంటల నుండి ములుగు జిల్లా, వెంటాపురం(వాజేడు) ప్రాంతానికి చెందిన చిడెం సాయి ప్రకాశ్ (మృతుడు) హన్మకొండ అదృశ్యమైనట్లుగా వచ్చిన ఫిర్యాదుపై హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా అదృష్యమైన యువకుడి బంధువులు ఇచ్చిన సమచారంతో పోలీసులు గతంలో మృతుడితో మనస్పర్థలు వున్న ములుగు వెంకటాపురం కానిస్టేబుల్ శ్రీనివాస్పై అనుమానం వ్యక్తం చేయడంతో, పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుల్లో ఒకడైన డేవిలీ సాయిని హన్మకొండ బస్తాండ్లో అదుపులో తీసుకుని విచారించారు. మిగిలిన నిందితులు వరంగల్ కోర్టు వెనుక భాగంలో అటోలో వున్నట్లుగా వచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మహిళా నిందితురాలు నిర్మలను హన్మకొండ బస్టాండ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ శ్రీనివాస్ 2009 హైదరాబాద్లో కానిస్టేబుల్గా ఎంపికై పరస్పర బదిలీల్లో నిందితుడు హన్మకొండ బదిలీ అయినాడు. మరికొద్ది రోజులకు 317 జి.ఓ ప్రకారం మరోమారు శ్రీనివాస్ ములుగు జిల్లాకు వాజేడ్ వెంకటాపురం పోలీస్ స్టేషన్ బదిలీ అయ్యాడు. నిందితుడు ఈ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించే సమయంలో ఇదే ప్రాంతంలో నివసించే మరో నిందితురాలు నిర్మలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ఆక్రమ సంబంధంగా మారటంతో నిందితురాలి బంధువు వరసకు కొడుకైన మృతుడు సాయి ప్రకాశ్తో పాటు నిందితురాని భర్త, అమె బంధువులు కానిస్టేబుల్ శ్రీనివాస్ వ్యవహరంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ అధికారులు కానిస్టేబుల్ శ్రీనివాస్ను సస్పెండ్ చేసారు. కొద్ది కాలం అనంతరం శ్రీనివాస్ తిరిగి గతేడాది డిసెంబర్లో విధుల్లో చేరాడు. తనపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్కు కారణమైన మృతుడు సాయి ప్రకాశ్పై కక్ష్య పెంచుకున్నాడు. ఈ నెల 15న నిందితురాలు నిర్మల తన మామగారికి ఆరోగ్య పరీక్షల కోసం తన భర్తతో పాటు, సాయి ప్రకాశ్తో కలిసి హన్మకొండకు కారులో వచ్చినట్లుగా నిందితుడు శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో, వెంటనే నిందితుడు శ్రీనివాస్ మిగితా నిందితులతో కల్సి అదే రోజు రాత్రి మృతుడు సాయి ప్రకాశ్ ఒంటరీగా ప్రయానిస్తున్న కారును ఆటో వెంబడిస్తూ సుమారు రాత్రి 11.30 సమయంలో నిందితులు గోపాల్పూర్ క్రాస్ రొడ్ వద్ద వున్న బేబి సైనిక్ స్కూల్ వద్ద నిందితులు కారు అడ్డగించి నిందితులు కారులో ఎక్కి కారును నడుపుతూ మృతుడు సాయి ప్రకాశ్ను తీవ్రంగా కొట్టుకుంటూ హసన్పర్తి శివారు ప్రాంతంలో కారు అపి మృతుడు సాయి ప్రకాశ్ను నిందితులు శాలువతో గొంతుని బిగించి దారుణంగా హత్య చేసారు. హత్య అనంతరం నిందితులు మృతుడి కారులోనే హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెడు గడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావిలో మృతుడి మృతదేహాన్ని పడవేసి నిందితులు తిరిగి వేలేరు మీదుగా హన్మకొండ ఏషియన్ మాల్ ప్రాంతంలో కార్ను పార్క్ చేసినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మరునాడు సాయి ప్రకాశ్ మృతదేహాన్ని గుర్తించి జిల్లెడు గడ్డ తండా గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అనుమాన్పడంగా మరణించిన వ్యక్తిగా హుస్నాబాద్ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన హన్మకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి, ఇన్స్స్పెక్టర్ సతీస్తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏ. ఎస్పీ మనన్ భట్ పాల్గొన్నారు.
………………………………………….