
* నలుగురు మావోయిస్టులు మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : ఛత్తీస్గఢ్ (Chathisghad)లో పోలీసు భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టు(Moiasts)లు మృతి చెందారు. బందెపార – కోరన్ జోడ్ అటవీ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా (Bijapur District) మద్దేడు పీఎస్ పరిధిలో ఆదివారం ఉదయం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వారి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
………………………………..