
* భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
* నలుగురు మావోయిస్టులు మృతి
ఆకేరున్యూస్, రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దట్టమైన అడవుల్లో మరోసారి బుల్లెట్ల వర్షం కురిసింది. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
…………………………….