
* మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధికై 1.17 కోట్ల రూపాయల కేటాయిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
ఆకేరున్యూస్ కమలాపూర్ : కమలాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా బిజెపి పార్టీ పనిచేస్తుందని కమలాపూర్ మండల బిజెపి అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ అన్నారు.గురువారం కమలాపూర్ లోని ఈటెల రాజేందర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు… మాజీ మంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ,ఈటెల రాజేందర్ కమలాపూర్ మండల అభివృద్ధికై ఎంతగానో పాటుపడ్డారని, అదే బాటలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా మండలంలోని అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఈజీఎస్ నిధుల కింద ఒక కోటి 17లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. పలు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలవికాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే పార్టీలకు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో బిజేపీ సీనియర్ నాయకులు బండి కోటేశ్వర, భోగి భిక్షపతి, భూపతి ప్రవీణ్, పుస్కూరి రాంబాబు, %ఎస% రాజ్ మహ్మద్,జెట్టి సారంగపాని ,చిట్టి సుందరయ్య, మేడిపెల్లి రాజు, పబ్బు శుభాష్, మారపెల్లి రాజు,చేరాల రాంబాబు,గుర్రం సురేష్, ఎగ్గోజు శ్రీనివాస్,చోటే మియా, నాగవల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….