
ఆకేరున్యూస్, ఇస్లామాబాద్: అల్ ఖాదిర్ ట్రస్టు భూమి అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలు దోషులుగా తేలారు. ఆ ఇద్దరికీ కోర్టు జైలుశిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్లు, బుష్రా బీబీకి ఏడేళ్ల జైలుశిక్ష ఖరారైంది. అల్ ఖాదిర్ ట్రస్టులో సుమారు 190 మిలియన్ పౌండ్ల అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అడియాలా జైలులో ఏర్పాటు చేసిన కోర్టు రూంలో.. జడ్జి నాసిర్ జావెద్ రాణా తీర్పును వెలువరించారు. ఇమ్రాన్, బుష్రాలపై కోర్టు ఫైన్ కూడా వేసింది. ఇమ్రాన్కు పది లక్షలు, బుష్రాకు అయిదు లక్షల జరిమానా విధించారు. ఒకవేళ ఆ జరిమానా కట్టకుంటే, మరో ఆర్నెళ్ల పాటు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు ఇచ్చింది.
……………………………………….