
* ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రకటించిన నారా లోకేశ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మహా నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్ (lokshe) ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునః నిర్మించే దిశగా చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. ఇక్కడ కూడా టీడీపీపీ(tdpp) మళ్లీ విస్తరిస్తామని ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్టీఆర్(Ntr) అనేది ఒక పేరు కాదని, ప్రభంజనం అని అన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కోటికి పార్టీ సభ్యత్వాలు చేరుకోవడం గర్వకారణం అన్నారు. తెలంగాణలో 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. పార్టీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
……………………………………..