
* సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హైయిన్తో భేటీ
* తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చ
ఆకేరున్యూస్, హైదరాబాద్: సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరుపుతున్నారు. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాలలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించారు. కాగా,, తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సింగపూర్ మంత్రి గ్రేస్ పు హైయిన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
…………………………………………….