
ఆకేరు న్యూస్, డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా(America)లో ఘోరం చోటుచేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్(Hyderabad)కు చెందిన రవితేజ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని చైతన్యపురి ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ(Raviteja) ఉన్నత విద్య కోసం 2022లో అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. రవితేజపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు. రవితేజ మృతి వార్త తెలిసి చైతన్యపురిలోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
………………………………………..