
* ఇద్దరు యూట్యూబర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆకేరున్యూస్, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన ఇద్దరు యూట్యూబర్లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్ కైమ్ర్ అదనపు సీపీ విశ్వప్రసాద్ విూడియాకు వెల్లడిరచారు. ‘నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్లో సీఎంను తిడుతున్న వీడియో వైరల్గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ విూడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ ఫిర్యాదు చేశారు. పల్స్ టీవీకి చెందిన ఓ రిపోర్టర్ గుర్తు తెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అందులో మాట్లాడిన వ్యక్తి సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పల్స్ టీవీ ఉద్దేశ పూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేయించిందని దర్యాప్తులో గుర్తించాం. పల్స్ టీవీలో వచ్చిన ఈ వీడియోను ’నిప్పుకోడి’ అనే ఎక్స్ హ్యండిల్లో ట్రోల్ చేశారు. కేసు దర్యాప్తు చేసి ఆ టీవీ ఛానెల్ సీఈవో, జర్నలిస్ట్ రేవతితో పాటు పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ను అరెస్ట్ చేశాం. టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రెండు ల్యాప్ టాప్లు, రెండు హార్డ్ డిస్క్లు, ఒక లోగో, ఒక రూటర్, 7 సీపీయూలు స్వాధీనం చేసుకున్నాం. రేవతిపై గతంలో బంజారాహిల్స్, ఎల్బీనగర్లో కేసులు ఉన్నాయి‘ అని అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
………………………………..