* వినూత్న కార్యక్రమానికి సర్కారు శ్రీకారం
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. సాంతితిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు సేవలను సులభతరంగా అందించేలా సీఎం చంద్రబాబు (CM Chandrababu) చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ (Watsup Governance) పై అవగాహన కల్పించడానికి ఏప్రిల్ నెలలో ‘ప్రతి ఇంటికి మనమిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్ ఫోన్లో 9552300009 నంబర్ ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్ లోనే అందిస్తామని తెలిపారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
