* ఏప్రిల్లో థాయిలాండ్, శ్రీలంక షెడ్యూల్
ఆకేరున్యూస్, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేనెల ఏప్రిల్లో విదేశీ పర్యటనకు థాయ్లాండ్, శ్రీలంక దేశాలకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 3-4 తేదీల్లో థారులాండ్ ఆతిధ్యం ఇస్తున్న ఆరవ బిఐఎంఎస్టిఇసి (శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగడానికి బ్యాంకాక్లో పర్యటించనున్నట్లు- భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడిరచింది. అనంతరం మోడీ ఏప్రిల్ 4-6 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకతో మోడీ చర్చలు జరపున్నట్లు- భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు- విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఏప్రిల్ 3 – 4 తేదీల్లో ప్రధాని థాయ్లాండ్లో పర్యటించనున్నారు. థాయ్లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్తో భేటీ కానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్లో జరగనున్న ’బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’కూటమి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టు-బడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత థాయ్లాండ్ పర్యటనను ముగించుకొని ప్రధాని ఏప్రిల్ 4న శ్రీలంక వెళతారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే గతేడాది భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. మోదీ తన పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై చర్చించనున్నారు.
…………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
