
ఆకేరున్యూస్, హైదరాబాద్: మాజీ ఉప ప్రధాన మంత్రి డా.బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని సిఎం రేవంత్ తదితరులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. బషీర్ బాగ్ లోని ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీలు వి .హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కూడా నివాళులర్పించారు.
………………………………………….