
* బిహార్లో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ
ఆకేరు న్యూస్, డెస్క్ : బిహార్లోని బెగుసరాయ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (RAHUL GANDHI) భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్ ఎస్యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగం, పేపర్ లీక్లపై నిరసనలు వ్యక్తం చేశారు. బీహార్లో వైట్ టీ-షర్టు ఉద్యమం విజయం సాధించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు తన సోషల్ మీడియా ఖాతాలో నిన్న వీడియో అప్పీల్ జారీ చేశారు. “స్టాప్ మైగ్రేషన్, ఉద్యోగాలు ఇవ్వండి యాత్ర ప్రపంచానికి మీ పోరాటం, బాధలు బీహార్ యువత మనోభావాలను చాటుతుంది ” అని రాహుల్ వీడియో సందేశంలో చెప్పారు. కొత్త బీహార్ (BIHAR)నిర్మాణానికి, సరికొత్త అవకాశాలకు వేదికగా ఈ యాత్ర నిలుస్తుందని తెలిపారు. బిహార్ అధికారులు, రాజకీయ నాయకులు పారిపోవద్దని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఎన్ ఎస్యూఐ నేషనల్ ఇన్చార్జి కన్హయ్య కుమార్ (KANHAYYA KUMAR) ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. కాగా, ఈ ఏడాది చివర్లో బిహార్ లో ఎన్నికలు జరగనున్నాయి.
…………………………………………..