
– బైక్ ర్యాలీ,30 మంది యువకుల రక్తదానం
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ ఉప్పల్, ఆద్వర్యంలో 30 మంది యువకులు రక్తదానం చేశారు. సోమవారం యువకులు భారీ సంఖ్యలో హాజరై డీజే పాటలతో గ్రామంలో జై భీమ్ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం స్థానిక జడ్.పి.హెచ్.ఏస్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి, రిటైర్డ్ డీఎస్పీ పుల్ల సంజీవరావు ,రిటైర్డ్ ఓఎస్డీ పుల్ల నతానియల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి మాట్లాడుతూ.. మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు.అనంతరం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 30 మంది యువకులు రక్తదానం చేశారు.రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిలు రిటైర్డ్ ఎస్పీ పుల్ల సంజీవరావు, ,మారేపల్లి మహేష్,బాలసాని రమేష్, పుల్ల అద్భుతరావు,పుల్ల విజేందర్, గుండపు చరణ్,పుల్ల నతానియల్, పూసల గణేష్, తాళ్ల పెళ్లి శ్రీధర్, నాగరాజు,బిక్షపతి, సత్యపాల్ , , హేమంత్ ,ప్రసాద్ , శ్రీనివాస్ శ్రీకాంత్,రోహిత్ ,నాగరాజ్ గణేష్ ,శ్రీధర్,రాజేష్ ,హరీష్ రాజ్కుమార్, యూత్ అసోసియేషన్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..