* నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ధరణి స్థానంలో తీసుకుని వచ్చిన తెలంగాణ భూ భారతి కార్యక్రమం గురువారం నుంచి నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూభారతి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డిలోని లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఖాజీపురంలో భూ భారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మద్దూర్ మండలం ఖాజీపురంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. అలాగే.. వికారాబాద్ జిల్లా పుడూరు గ్రామంలో జరిగే భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు పాల్గొననున్నారు. ఏప్రిల్ 17 నుంచి జూన్ 2 వరకు భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులు నిర్వహించనుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. దీని ప్రయోజనం రాష్ట్రంలో భూ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం , రైతులకు, పర్యావరణానికి అనుకూలంగా భూముల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం, తెలంగాణలో భూముల రిజిస్టేష్ర్రన్, భూమి చట్టాలు, ఆస్తి హక్కుల పునరుద్ధరణ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. భూ భారతి కార్యక్రమం ద్వారా, ప్రభుత్వమే భూముల ఖాతాలు, రికార్డులను సరికొత్తగా సృష్టించి వాటి మాలికల హక్కులను సులభంగా ప్రజలకు అందించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రైతులకు భూములపై అనువైన పర్యవేక్షణను, కరెంట్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ అంశాలు వంటి వాటిపై అవగాహన కూడా పెంచుతుంది.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
