ఆకేరున్యూస్, హైదరాబాద్: పదో తరగతి మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశానికి ప్రభుత్వం ఓ నిర్ణయానిక వచ్చింది. 24-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి మెమోలపై మార్కులతో పాటు గ్రేడ్స్ను సైతం ముద్రించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు. పదో తరగతిలో ఈ విద్యాసంవత్సరం నుంచి గ్రేడిరగ్ విధానాన్ని తీసేశారు. గ్రేడ్ల స్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంటర్నల్స్ను రద్దుచేయాలని తీసుకున్న నిర్ణయం ఆలస్యం కావడంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్ ఉంటాయని ప్రకటించారు. మెమోలపై మార్కులు ఎలా ముద్రించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ పలు సిఫారసులు చేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
