* 23 మంది మావోయిస్టుల హతం
ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్: తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకరకాల్పులు జరిగాయి. వివరాలు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటలో నిమగ్నమయ్యాయి.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 23 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
