* ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
* వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. చౌతియా ఛత్తీ నుంచి రాయ్పూర్కు వస్తుండగా జరిగిన రోడ్దు ప్రమాదంలో ఈ దారుణం జరిగింది. ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. రాయ్పూర్ (Raiipur) – బలోద బజార్ (Balod Bazar) దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వస్తున్న ప్యాసింజర్ వాహనాన్ని అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు, నలుగురు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో 30 మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు రాయ్పుర్ ఎస్పీ (Raypur Sp)లాల్ ఉమ్మెద్ సింగ్ వెల్లడించారు. వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్పూర్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయ్పుర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
