* ఎర్రబెల్లి ఫాం హౌస్ లో జారిపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి
* తుంటి ఎముకకు గాయం
* యశోధలో చికిత్స
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్ : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తుంటి ఎముక గాయంతో
హైదరాబాద్ లోని యశోధా హాస్పిటల్ లో చేరారు. మాజీ సీఎం కేసీఆర్ కు చెందిన ఎర్రబెల్ల ఫాం హౌస్లో ఈ సంఘటన జరిగింది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపధ్యంలో ఆయనను కులవడానికి పలువుల బీఆర్ ఎస్ నాయకులు ఫాం హౌస్కు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే పల్లా కేసీ ఆర్ ను కలువడానికి ఎర్రబెల్లి ఫాం హౌజ్ కు వెళ్లారు. ఫాం హౌస్కు వెళ్లిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు జారి పడడంతో తుంటి ఎయుకకు గాయం అయింది. గాయపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే హైదరాబాద్ లో యశోధా హాస్పిటల్ కు తరలించారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
