
* సీఎం రేవంత్ ను అభినందించిన రాజాసింగ్
*గోశాలల నిర్మాణంపై హర్షం
ఆకేరున్యూస్, హైదరాబాద్ ; సీఎం రేవంత్ రెడ్డి పనితీరును కాంగ్రెస్ పార్టీ వారు ,లేదా మిత్ర పక్షాల వారు మెచ్చుకున్నారంటే అది పెద్ద విశేషం ఏమీ కాదు.. కానీ పొద్దున లేచింది మొదలు కారాలు మిరియాలు నూరుకునే బీజేపీ పెద్దలు అందులో ఫైర్ బ్రాండ్ లాంటి ఎమ్మెల్యే రాజాసింగ్ రేవంత్ ను అభినందించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గోశాలలపై దృష్టి కేంద్రీకరించింది. గోశాలల నిర్మాణం,గో సంరక్షణ కోసం సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించింది. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూ యానిమల్
హస్పండ్రీ,సవ్యసాచి ఘోష్, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అగ్రకల్చర్ డిపార్ట్మెంట్ రఘునందన్ రావు సభ్యులుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో మొదటి దశలో వేములవాడ , యాదగిరిగుట్ట ,ఎంకేపల్లి ఆలయ పరిసరాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అదికారులను ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై హర్షం వెలిబుచ్చారు. గోశాలల నిర్మాణం, గోవుల పరిరక్షణ కమిటీలో సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ ముఖ్యమంత్రిని కోరారు. గోవుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణలో గోవధను నిషేదించాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞపి్తి చేశారు.
………………………………………….