
* డీఎన్ ఏ పరీక్షల ద్వారా 163 మృత దేహాల గుర్తింపు
*124 భౌతికకాయాలు కుటుంబ సభ్యులకు అప్పగింత
ఆకేరు న్యూస్ డెస్క్ : అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. డీఎన్ ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించారు. 242మంది ప్రయాణికుల్లో ఒక్కరు మినహా అందరూ చనిపోయారు. విమానం బీజే వైద్యకళాశాల భవనంపై కూలడంతో భవనంలో ఉన్న 29 మంది మృత్యువాత పడ్డారు. ఇంత వరకు 163 మంది మృతదేహాలను డీఎన్ ఏ పరీక్షల ద్వారా గుర్తించగా అందులో 124 మృతదేహాలను వారి వారి కుటుంబసభ్యలకు అందజేశారు.మరికొన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి..అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. ఒక్కో మృతదేహానికి ఈ పరీక్ష నిర్వహించేందుకు దాదాపు 75 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ చాలా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. డీఎన్ఏ గుర్తించే క్రమంలో ఫోరెన్సిక్ బృందాలు నిరంతరాయంగా తమ పనిని కొనసాగిస్తున్నాయి.ఇక ఈ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాంతోపాటు ఈ విమానం కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతదేహాన్ని సైతం వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలను అంత్యక్రియలు పూర్తయ్యాయి.మరోవైపు ఈ ప్రమాద ఘటన అనంతరం గాయపడిన 71 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి వెల్లడించారు. వారిలో ఇద్దరు మరణించారని.. మిగిలిన తొమ్మిది మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వివరించారు.
………………………………………..