
* ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
* ములుగు పోలీస్స్టేషన్ను తనిఖీచేసిన ములుగు జిల్లా ఎస్పీ శబరిష్
ఆకేరున్యూస్, ములుగు: పోలీస్ అధికారులు విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు నమ్మకం కలిగేలా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఎస్పి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందిన వెంటనే విచారణ అధికారిని నియమించి విచారణ అనంతరం ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయాలని సూచించారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు రికార్డులు పెండిరగ్ లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. కంప్యూటర్ పని పెండిరగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫైల్ లు ఆన్ లైన్లో అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. సిబ్బంది ప్రతీ ఒక్కరిని విడివిడిగా వారు నిర్వహించే విధులను, వారి వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట ములుగు డిఎస్పి రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, ములుగు సీఐ సురేష్, ములుగు పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వరరావు, పోలీస్స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
…………………………………………..