
ఆకేరు న్యూస్, శ్రీశైలం ః ఏపి లోని శ్రీశైల మహా క్షేత్రంలో జూలై 1 నుంచి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించ నున్నారు.. మంగళవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకూ ఉచిత దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాస రావు తెలిపారు. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ టోకెన్ల విధానం అమలు చేస్తారు. భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్తో టోకెన్లు జారీ అవుతాయి. రోజుకు 1,000–1,200 మందికి అవకాశం ఉంటుంది..
……………………………………………