
* ప్రేమను అంగీకరించలేదని తల్లిపై కక్ష
*ప్రియుడి సహాయంతో తల్లిని హత్య
*జీడిమెట్ల హత్యపై డీసీపీ సురేష్ కుమార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః తన ప్రేమకు అడ్డు వస్తుందనే పదో తరగతి చదువుతున్న తేజశ్రీ తన తల్లిని హత్య చేసిందని బాలానాగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన హత్యకు సంబందించిన వివరాలను మీడియాకు తెలిపారు. తేజశ్రీకి ఆమె ప్రియుడు శికకు ఎనిమిది నెలల క్రితం ఇన్స్టా గ్రాంలో పరిచయం అయిందని డీసీపీ తెలిపారు. ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయం అయిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందన్నారు. ఈ నేపధ్యంలో తల్లి అంజలి వీరి ప్రేమను అంగీకరించలేదన్నారు. తన తల్లి తమ ప్రేమను అంగీకరించడం లేదని తల్లిపై కోపాన్ని పెంచుకున్న తేజశ్రీ తన తల్లిని అడ్డుతొలగించుకోవాలని భావించి శివ సహాయం కోరిందని డీసీపీ తెలిపారు. ఈ నేపధ్యంలో ఇటీవల వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోగా త్లల్లి ఫిర్యాదు మేరకు ట్రేస్ అవుట్ చేసి 20 వా తారీఖు రోజున బాలికను తల్లికి అప్పగించామని డీసీపీ తెలిపారు. తన తల్లిని హత్య చేయాలని పథకం వేసుకున్న తేజశ్రీ 23న శివను పిలిపించందన్నారు.23న సాయంత్రం పూజ గదిలో పూజ చేస్తున్న తల్లి అంజలిపై ముగ్గురూ కలిసి దాడిచేశారని డీసీపీ తెలిపారు. కాసేపటికి తన తల్లి ఇంకా అంజలి చనిపోలేదని తెలుసుకున్న ఈ ముగ్గురు చున్నీతో మెడను బిగించి ఊపిరాడకుండా చేసి చంపినట్లు డిసిపీ వివరించారు. తేజశ్రీకి చిన్నప్పటి నుండే తల్లిపై పగ పెంచుకుందని పోలీసు విచారణలో తేలినట్లు చెప్పారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడే తన తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డీసీపీ తెలిపారు. పోలీసు విచారణలో కూడా ఈ విషయాన్ని తేజశ్రీ తెలిపిందని డీసీపీ అన్నారు.
………………………………………………………