
ఆకేరు న్యూస్ డెస్క్ : అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన మరువక ముందే ఉత్తరా ఖండ్ లో మరో ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లో రుద్ర ప్రయాగ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు అలకానంద నదిలో పడి పోయింది. బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మరణించగా మిగతా వారు నదిలో గల్లంతయినట్లు సమాచారం. గల్లంతయిన వారి కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపామని అధికారులు చెప్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
………………………………………