
* ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి
* సర్కారుపై కేటీఆర్ ఫైర్
* జూరాల ప్రాజెక్టు గేట్ రోప్ తెగిపోవడంపై విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఒక్క ఇటుక పేర్చడం రాని సీఎంకు ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా చేతకావడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వల్లే జూరాల ప్రాజెక్టు (JURALA PROJECT) డేంజర్ లో పడిందన్నారు. ప్రాజెక్ట్ గేట్ రోప్ తెగిపోవడంపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ (REVANTH) సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని హితవు పలికారు. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC TUNNEL) కుప్పకూలి ఎనిమిది మంది చనిపోయారని, పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వట్టెం పంప్హౌస్ మునిగిపోయిందని, సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. తాజాగా జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్లు బలహీనంగా ఉండడం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.
………………………………………….