
* డీఎస్పీగా ఎంపికైన మౌనిక
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లా కేంద్రం లోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలానికి చెందిన గ్రూప్ వన్ డిఎస్పి ఉద్యోగాన్ని సాధించిన మౌనిక ను ఆమె తల్లిదండ్రులను జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొదటగా కష్టపడి ఉద్యోగం సాధించిన మౌనిక ను, ఆమె కు ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉంటూ ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. ఏ విధంగా అయితే ఉద్యోగం కోసం కష్టపడ్డారో ఉద్యోగంలో కూడా అదే విధంగా కష్టపడి విజయం సాధించాలని, తమ తల్లిదండ్రుల ఆశలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ పోలీస్ కుటుంబం లోకి ఆమె ను సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. కష్టపడి చదివితే ఎంతటి ఉద్యోగమైనా సాధించి తీరుతారని, ప్రపంచమంతటికి పరిచయమవుతారని, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెడతారని, దానికి ఉదాహరణ మౌనిక అని అన్నారు. ఉద్యోగం రాకముందు మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఏ విధంగా అయితే ఉంటామో, ఏ విధంగా ఆలోచిస్తామో ఉద్యోగం వచ్చాక కూడా ఏ లక్ష్యం కోసం అయితే కష్టపడ్డామో ఆ లక్ష్యం సాధించేంతవరకు అదేవిధంగా కృషి చేయాలని అన్నారు. ఎల్లప్పుడూ ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే ఉత్తమ పోలీసు వ్యవస్థగా పేరొందిందని, అందులో మీరు భాగమవుతున్నారని, పోలీస్ వ్యవస్థ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా నడుచుకోవాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ , డిసిఆర్బి డిఎస్పి కిషోర్ కుమార్ , ములుగు డి.ఎస్.పి రవీందర్ , ఇనస్పెక్టర్ లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, మౌనిక కుటుంబ సభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………..