
* కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం ప్రాంగణ అభివృద్ధి పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేడారం దేవాలయం ప్రాంగణ అభివృద్ధి పనుల మ్యాప్ ప్రకారం తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలను చేశారు. ప్రతి రోజు వచ్చే భక్తులకు ఆటంకం కలుగకుండా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఆర్ ఆండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్, కాంట్రాక్టర్, ఎండోమెంట్ అధికారులు, పూజారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………