KTR Defamation Notice Revanth
* సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు కరెక్ట్ కాదు
అకేరు న్యూస్ వరంగల్ :వరంగల్లో రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ, గ్లోబరీనా సంస్థ తనదంటూ నిరూపించలేకపోతే పరువు నష్టం నోటీసు పంపామని, దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్ చేశారు.రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసు పంపామని, సరైన సమాధానం ఇవ్వకపోతే కోర్టులో ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకుందో చెప్పాలని నిలదీశారు.ఈ అంశంపై ఏ విచారణకైనా తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
