* భారతదేశం తరఫున న్యాయనిర్ణేతగా ఎంపిక
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరఫున ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. భరద్వాజ్ ఎంపికతో వరంగల్ (Warangal) వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఫిలిప్పీన్స్ దేశంలో ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. జేఎన్ఎస్లోని జిమ్నాస్టిక్స్ అకాడమీ పూర్వవిద్యార్థి భరద్వాజ్ పలు జాతీయస్థాయి పోటీల్లో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో పతకాలు సాధించారు. ఆ ప్రతిభ ఆధారంగా క్రీడాకారుల కోటాలో ఇండియన్ రైల్వే(Indian Railway) లో ఉద్యోగం సాధించి కాజీపేటలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్(World Junior Gymnastics Champion) లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
