* 3. 90 కోట్లు ప్రభుత్వాదాయానికి గండి
* 15 మంది అరెస్ట్.. పరారీలో 9 మంది
* నిందితుల వద్ద నుండి 63,19 లక్షలు స్వాధీనం
ఆకేరు న్యూస్, హనుమకొండ : జనగామ, యాదాద్రి జిల్లాలో ధరణి, భూబారతి రిజిస్ట్రేషన్లలో కోట్లలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన నిందితులను అరెస్ట్ చేసిన నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియాకు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం ముఠాలో 15 మందిని అరెస్ట్ చేయగా మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ వివరించారు. నిందితుల నుండి 63. 19 లక్షల నగదు తో పాటు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలను,17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వివరాలను ఆయన వెళ్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు కుంభకోణంలో ప్రధాననిందితులైన పసునూరి బసవరాజు,జెల్లా పాండు ఇరువురు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆన్లైన సర్వీస్ నిర్వహించే వారని సీపీ తెలిపారు. నిందితుల్లో ఒకరైన గణేష్ తనకు తాను ఆన్ లైన్ సెంటర్లతో పరిచయం చేసుకొని చెల్లించాల్సిన మొత్తాన్ని ఎన్ ఆర్ ఐ ఖాతా లో పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి అట్టి వసూలు చేసిన డబ్బు నుండి అన్లైన్ సర్వీస్ వ్యక్తులకు మరియు మద్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఇ చాలాన్ని ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు అట్టి ధరణీ/భూభారతీ వెబ్సైట్లో ఇన్స్స్పెక్ట్ ” ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చాలన్ రుసుము తగ్గించేవాడు. అనంతరం అట్టి ఛలాన్ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు.ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ను ఉపయోగించి నిందితులు ప్రభుత్వానికి చెల్లించిన రుసుము కు సంబంధించి వెబ్సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసి అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించిన నకిలీ చలాన్లను స్థానిక యం.ఆర్.ఓ/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొదుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడి కావున జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూ భారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్ సైట్లో నమోదు చేసేవారు. ఇందుగాను ప్రధాన నిందితులు మిగితా వారికి పది శాతం నుండి 30శాతం వరకు కమిషన్ చెల్లించేవారు. ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావా దేవిల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందులో జనగామ జిల్లాలో 7కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.ఈ ముఠా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏ. ఎస్పీ పండరి చేతన్. జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారయణ రెడ్డి, రఘునాథ్్పల్లి సర్కిల్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఇతర ఎస్.ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో…
1.పసునూరి బసవ రాజు, వయసు: 32 సంవత్సరాలు,యాదాద్రి జిల్లా. 2. జెల్లా పాండ, వయసు: 46 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా.3.మహేశ్వరం గణేష్ కుమార్, వయసు: 39 సంవత్సరాలుఇయాదాద్రి జిల్లా. 4. ఈగజులపాటి శ్రీనాథ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ. 5. యెనగంధుల వెంకటేష్, జనగామ. 6. కోదురి శ్రావణ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ. 7. కొలిపాక సతీష్ కుమార్ వయసు: 36 సంవత్సరాలు, కొడకండ్ల (ఎం), జనగామ. 8. తడూరి రంజిత్ కుమార్ వయసు 39 సంవత్సరాలు, నర్మెట్ట, జనగామ. 9. దుంపల కిషన్ రెడ్డి, వయసు: 29 సంవత్సరాలు, ఆత్మకూర్ (ఎం), యాదాద్రి జిల్లా, 10. దశరథ మేఘావత్ వయసు: 28 సంవత్సరాలుతురుపల్లి. 11. నారా భాను ప్రసాద్, వయసు: 30 సంవత్సరాలు, యాదగిరిగుట్ట, 12. గొపగాను శ్రీనాథ్, వయసు: 32 సంవత్సరాలు, శివ కుమార్, వయస్సు 33, అమంగల్, నల్లగొండ. 15. అలేటి నాగరాజు, వయస్సు 32, యాదాద్రి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.యాదాద్రి జిల్లా, 13. ఒగ్గు కర్నాకర్, వయసు: 42 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 14. కమల్ల శివకుమార్, 33, అమంగల్ నల్లగొండ,15. అలేటి నాగరాజు వయస్సు 32 యాదాద్రి జిల్లాకు చెందిన వారుగా సీపీ వివరించారు.

