Bakrid Sapling Plantation Program
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి గ్రామ ఈద్గా ప్రాంగణంలో ముస్లింలు, పోలీసులు మొక్కలు నాటారు. రహీమ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన కార్యక్రమంలో ఈద్గా సభ్యులు షౌకత్, అజ్జు, షుకూర్, ఆజమ్, ఖుబేబ్, సోహెబ్, ఇమ్రాన్ తదితరలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని రహీం పిలుపునిచ్చారు.
