Shabad Murder Accused Reward
ఆకేరు న్యూస్, రంగారెడ్డి: షాబాద్ పరిధిలో ఆరుగురి దారుణ హత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ షాబాద్ సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
* పోలీసుల నిర్లక్ష్యమే శాపమైందా..
గతంలోనే ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు రాజ్కుమార్పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, పోలీసులు అతడిని సకాలంలో అరెస్ట్ చేయకపోవడమే ఈ ఘోరానికి దారితీసిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు రాజ్కుమార్కు కొందరు పోలీసులు పరోక్షంగా సహకరించడం వల్లే ఈ దారుణం జరిగిందని వారు వాపోతున్నారు. ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకున్నప్పటికీ, తమకు జరిగిన అన్యాయానికి బాధ్యులెవరని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
* నిందితుడిపై రూ. 2 లక్షల రివార్డ్..
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు రాజ్కుమార్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లేదా అతడిని పట్టుకోవడానికి సహకరించిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి (రివార్డ్) అందజేస్తామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
