Virat Kohli New Record
* ఇంగ్లాండ్ గడ్డపై కోహ్లీ కొత్త చరిత్ర..
* ద్రవిడ్ రికార్డుకు చెక్!
* SENA దేశాల్లో మరో అరుదైన ఘనత
ఆకేరు న్యూస్, డెస్క్:
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించి, ఆ దేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.
మ్యాచ్లో తొలి బౌండరీతోనే ఈ మైలురాయిని అందుకున్న కోహ్లీ, ఇంగ్లాండ్లో తన స్థిరమైన ప్రదర్శనను మరోసారి నిరూపించాడు. ఇప్పటివరకు రాహుల్ ద్రవిడ్ 56 ఇన్నింగ్స్ల్లో 2,645 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ ఆ రికార్డును అధిగమించి కొత్త నంబర్-1గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 2,626 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
* 12 ఏళ్ల నాటి చేదు జ్ఞాపకానికి ముగింపు
కార్డిఫ్ మైదానంలో 12 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్పై డకౌట్గా వెనుదిరిగిన కోహ్లీ.. అదే వేదికపై ఈసారి తొలి బౌండరీతోనే తన పాత జ్ఞాపకాలను చెరిపేశాడు. ఆత్మవిశ్వాసంతో ఆరంభించిన ఈ ఇన్నింగ్స్ అభిమానులను ఉత్సాహపరిచింది.
* SENA దేశాల్లో మరో అరుదైన ఘనత
ఈ మ్యాచ్తో కోహ్లీ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాల్లో కలిపి 100 వన్డే మ్యాచ్లు ఆడిన భారత క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు. విదేశీ గడ్డపై అతని నిలకడైన ప్రదర్శనకు ఇది మరో నిదర్శనంగా చెప్పొచ్చు.
