Puri rath yatra
* 120 మందికి పైగా గాయాలు
ఆకేరు న్యూస్, డెస్క్: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తులు అశేషంగా తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
ఈ ప్రమాదంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 120 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అత్యవసర ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
