
* మృతులు ఇద్దరు అన్నదమ్ములు
ఆకేరున్యూస్, వాజేడు: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. వాజేడు మండలం పెనుగోడు గ్రామానికి చెందిన ఉయిక రమేష్, అర్జున్ను గొడ్డళ్లతో నరికి హతమార్చారు. ఈ ఇద్దరు వరుసకు అన్నదమ్ములు. మృతుల్లో ఒకరైన రమేష్ ఇదే మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఈ ఇద్దరు తమ దళాల కదలికలను పోలీస్ లకు చేర వేస్తున్నారని శాంత పేరుతో మృతదేహాల దగ్గర మావోయిస్టుల లేఖలో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ లు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
……………………………..