
* షాక్లో నిగ్వ గ్రామస్థులు
* వారం రోజులుగా అదే నీరు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామవాసులకు షాక్ తగిలే వార్త ఇది. అక్కడి వాటర్ ట్యాంకులో కోతి కళేబరం ఉన్నట్లు వెలుగులోకి రావడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా అదే నీటిని అధికారులు తమకు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు దుర్వాసన వస్తోందని అనుమానం రావడంతో ట్యాంకును పరిశీలించడంతో అందులో చనిపోయిన కోతి కనిపించింది. వెంటనే అధికారులు వాటర్ ట్యాంకును శుభ్రం చేయించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ వారం రోజులుగా అదే నీటిని తాగుతున్నామా అని.. గ్రామస్థులు వాపో్తున్నారు.
………………………………………