
* మేనిఫెస్టోను రిలీజ్ చేసిన అరవింద్ కేజ్రీవాల్
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలను తమ వైపునకు తిప్పుకునేలా ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలను గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే ఏడు అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్లో మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో బీజేపీని ఆప్ కేంద్ర ప్రభుత్వం ఏడు డిమాంట్లను ముందుంచింది. కేంద్ర బడ్జెట్లో ఎడ్యుకేషన్ కేటాయింపులను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని..
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఉన్నత విద్య చదివే వారికి సబ్సిడీలు, స్కాలర్షిప్లు ఇవ్వాలని.. హెల్త్ బడ్జెట్ను 10 శాతానికి పెంచాలని.. అలాగే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రద్దు చేయాలి. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలి. నిత్యావసర సరకులపై జీఎస్టీని ఎత్తివేయాలి. సీనియర్ సిటిజన్లకు బలమైన రిటైర్మెంట్ ప్లాన్, పెన్షన్ స్కీమ్స్ తీసుకురాలి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి. దేశ వ్యాప్తంగా రైలు ప్రయాణ టికెట్లలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించాలి. పన్నుల ద్వారా వచ్చే సొమ్మును విద్యతో పాటు ద్రవ్యాల్బోణం నుంచి మధ్యతరగతి వారిని కాపాడేందుకు తాము వినియోగిస్తున్నట్లు తెలిపారు.
……………………………………….