
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేస్ (Formula E Race Case) కేసులో నిందితులను ఏసీబీ వరుసగా ప్రశ్నిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్(ktr), ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvindkumar)ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్ ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డి (Bln Reddy)ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు 6 గంటలుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిన విధి విధానాలతో పాటు రేస్ నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్ ఎండీఏ(HMDA) ఎంత ఖర్చు చేసిందనే కోణంలో బీఎల్ఎన్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలిసింది.
……………………………………………………………….