
* ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
* సమ్మిట్కు విచ్చేసిన దిగ్గజ కంపెనీలు
* రెండు రోజుల పాటు సాగనున్న సమ్మిట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ హెచ్ఐసీసీ(HICC)లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై దేశంలో తొలిసారిగా అంతర్జాతీయ సదస్సు(GLOBAL SUMMIT) జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CHIEF MINISTER REVANTHREDDY) గ్లోబల్ సమ్మిట్ను ఉదయం ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు దిగ్గజ కంపెనీలు విచ్చేశాయి. దేశ, విదేశాల నుంచి దాదాపు 2 వేల మంది ఐటీ రంగ నిపుణులు విచ్చేశారు. ఏఐకు గ్లోబల్ హబ్గా హైదరాబాద్ను మార్చేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళిక రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు(MINISTER DUDDILLA SRIDHARBABU) పాల్గొన్నారు.