
* ఏం కావాలో చెప్పండి..మీకు అండంగా ఉంటాం
* ఇంకా 22 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా..
* ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమకు సహకరిస్తా..
* 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకనామీ సాధించాలి
* ఐటీ , ఫార్మా రంగాలతో పాటు సీనీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి
* తెలంగాణ అభివృద్ధికి మీ సహకారం కావాలి
* గద్దరన్న అంటే ఓ విప్లవం.. ఓ వేగుచుక్క
* గద్దర్ సినీ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
* హైటెక్స్ లో ఘనంగా గద్దర్ సినీ అవార్డుల వేడుక
*పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. కోమటి రెడ్డి వెంకటరెడ్డి,వాకాటి శ్రీహరి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : పైకి కఠినంగా కన్పించినా మీరంటే నాకు అభిమానమే అని
సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులనుద్దేశించి అన్నారు.. శనివారం హైదరాబాద్ లోని
హైటెక్స్ లో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి గా పాల్గొని కళాకారులకు బహుమతులు అందజేశారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నారు. సినీ పరిశ్రమ అంటే తనకు అభిమానమని సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పదేళ్ల క్రితం నిలిపివేయబడ్డ నంది అవార్డులను తిరిగి పునరుద్ధరించడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1964లో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే సినీ కళాకారులను నంది అవార్డుల పేరుతో గౌరవించడం జరిగిందన్నారు. మొట్ట మొదటి నంది అవార్డు అక్కినేని నాగేశ్వర్ రావుకు ఇవ్వడం జరిగిందని సీఎం గుర్తు చేశారు. అప్పటి నుండి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సాంప్రదాయం కొనసాగిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత అవార్డుల ప్రక్రియ ఆగిపోయిందని తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సినీ కళాకారులకు అవార్డులను పనురుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్నమన్నారు. అయితే తెలంగాణ ముద్దబిడ్డ .. గద్దర్ పేరున ఏర్పాటు చేస్తే గద్దర్ కు తగిన
గౌరవం ఇవ్వడమే కాకుండా గద్దరన్న పేరు చిరస్థాయిగా మిగిలిపోతుందనే నిర్ణయంతో సీనీ అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం జరిగిందన్నారు.
ఇప్పుడు నాలుగో తరం నడుస్తోంది
సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగోతరం నడస్తోందని సీఎం రేవంత్ అన్నారు.మొదటి తరంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ లు కాగా రెండో తరంలో కృష్ణ,శోభన్ బాబు,కృష్ణం రాజు తదితరులు అని అన్నారు. ఇకా మూడో తరంలో మెగాస్థార్ చిరంజీవి, వెంకటేశ్,నాగార్ఝున,బాలకృష్ణ అని రేవంత్ అన్నారు. ఇప్పుడు నాలుగో తరంలో మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,పవన్ కళ్యాన్,రాంచరణ్ లాంటి యువకులది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ
తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ ని సాధించాలనదే తన ధ్యేయమని సీఎం గుర్తు చేశారు. దీనికి ప్రపంచ దేశాలతోనే మన పోటీ అని సీఎం అన్నారు. ఐటీ.. ఫార్మా ఇతర రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా ఎదగాలని తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యం కావాలని సీఎం అన్నారు. సినీ పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని సినీ ప్రముఖులకు సీఎం విజ్ఞప్తి చేశారు. మీరు ప్రణాలికలు రచించండి ప్రభుత్వ సహకారం ఉంటుందని హమీ ఇచ్చారు.
తెలంగాణకు ఎవరైనా రావచ్చు
తెలంగాణకు ఎవరైనా రావచ్చని ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని సీఎం రేవంత్ అన్నారు. ప్రపంచంలోని ఫార్చూన్ ఐదువందల కంపెనీల్లో 85 కంపెనీల ఫుట్ ఫాల్స్ తెలంగాణలోనే ఉన్నాయని సీఎం అన్నారు. హైదరాబాద్ కు ముంబై,చెన్నై,బెంగళూరు, అమరావతి లాంటి నగరాలతో పోటీ కాదని న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియా, చైనాలతోనే హైదరాబాద్ కు పోటీ అని సీఎం అన్నారు.తాను ఇంకా 22 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని భవిష్యత్ లో ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధి సహకరిస్తానని సీఎం అన్నారు.
గద్దర్ అంటే ఓ విప్లవం
గద్దర్ అంటే ఓ విప్లవం అని ఓ వేగుచుక్క అని గద్దరన్న స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన స్పూర్తితోనే తెలంగాణ కోసం పోరాడామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. గద్దరన్న పేరుతో అవార్డలు ఇవ్వడం గద్దరన్నకు తగిన గుర్తింపు ఇచ్చామన్నారు. అలాగే నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు
కన్నుల పండువగా అవార్డుల ప్రదానం
హైదరాబాద్ లోని హైటెక్స్ లో శనివారం రాత్రి జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి అవార్డు విజేతలతో పాటు జ్యూరీ సభ్యులు టాలీవుడ్ సినీ ప్రముఖులు , ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క ,తెలంగాణ సినీమాటొగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, మంత్రి వాకాటి శ్రీహరి, మధు యాష్కి తదితరులు హాజరయ్యారు.
…………………………………………..