
* త్వరలో రేషన్షాపుల్లో కోడిగుడ్ల పంపిణీ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని రేషన్కార్డుదారులకు మరో కొత్త శుభవార్త వినిపించనుంది. కోడిగుడ్డులోని పోషక విలువలను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల్లో గుడ్లు కూడా పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా రేషన్ షాపుల్లో పప్పులు, బియ్యం, నూనెలు వంటి నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తుంటారు. అయితే గుడ్డులోని పోషకాల దృష్ట్యా రేషన్ ద్వారా వీటిని కూడా సప్లై చేయాలని ఎన్ఈసీపీసీ చెబుతోంది. రేషన్ కార్డు ద్వారా ప్రజలకు నెలకు కనీసం 30 గుడ్లు అందిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు.
…………………………………..