
* ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటనం
* పదివేల మీటర్ల ఎత్తు, 150 కి.మీ, దూరం మేరకు ఎగిసి పడుతున్న బూడిద
* ఎయిర్ ఇండియాతో సహా పలు అంతర్జాతీయ విమానాలు రద్దు
ఆకేరు న్యూస్ డెస్క్ ః ఢిల్లీ నుంచి బాలికి బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం ఎ12145 ని అధికారులు రద్దు చేశారు. బాలికి బయలు దేరిన ఈ విమానాన్ని భద్రతా కారణాల రీ్త్యా తిరిగి వెనక్కి రప్పించారు. విమానం సురక్షితంగా ఢిల్లికి చేరుకుంది. తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం బద్దలవడంతో ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో అక్కడికి సమీపంలోని బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం బుధవారంనాడు వెనక్కి మళ్లింది.ఇండోనేసియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లో లెవోటోబి లకి లకి పర్వతం మంగళవారం సాయంత్రం విస్ఫోటనం చెందటంతో 10,000 మీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడింది. 150 కిలోమీటర్ల వరకూ ఈ బూడిద కనిపిస్తోంది. బుధవారం ఉదయం మరోసారి విస్ఫోటనం చెందడంతో దట్టమైన బూడిద ఎగసిపడుతోందని అధికారులు తెలిపారు. 8 కిలోమీటర్ల మేర డేంజర్ జోన్ ప్రకటించారు. దీంతో బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసారు.కాగా, ఎయిరిండియా ప్రతిరోజూ దేశీయంగా, అంతర్జాతీయంగా 1,000కు పైగా విమాన సర్వీసులను నడుపుతోంది. జూన్ 12 నుంచి 17 వరకూ 83 ఎయిరిండియా విమానాలు రద్దయ్యాయని, వాటిలో 66 బోయింగ్ 787 విమానాలు ఉన్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
…………………………………………