
* ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మావోల పిలుపు
* మావోయిస్ట్ నేత జగన్ పేరుతో లేఖ విడుదల
ఆకేరు న్యూస్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మావోలు రెండు తెలుగు రాష్ట్రాల బంద్ నకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖ విడుదల అయింది. దేశ వ్యాప్తంగా మావోలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఇటీ వల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. దీంతో కేంద్ర భద్రతా దళాలు మావోల ప్రభావితం ఉండే ప్రాంతాలపై మావోల స్థావరాలపై విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చత్తీస్ ఘడ్ ప్రాంతంలో మావోలు అణువణువు జల్లెడ పడుతున్నారు. చత్తీస్ ఘడ్ లోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో మావోయిస్టు ముఖ్య నేతలు ఎన్ కౌంటర్ అయిన విషయం తెల్సిందే.. ఈ నేపధ్యంలో బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టు నేత జగన్ పేరుతో లేఖ విడుదలయింది. ఆ లేఖలో బీజేపీ హిందుత్వ ఫాపిస్టు విధానాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ చలం అలియాస్ ఆనంద్,సుధాకర్,గౌతం..అలాగే కామ్రేడ్ మైలారపు అడెల్ అలియాస్ భాస్కర్ తో పాటు ఏడుగురు ఎన్ కౌంటర్ కు గురైనట్లు పేర్కొన్నారు. దేశంలో ఉన్న సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనే కేంద్రంలోని సర్కార్ ఆపరేషన్ కగార్ ను చేపట్టిందని ఆ లేఖలో పేర్కొన్నారు . అమాయకులైన ఆదివాసీలను అన్యాయంగా నిర్భందానికి గురి చేస్తూ వారికి అంగడా ఉండే మావోయిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలని లేఖలో పేర్కొన్నారు. కగార్ వ్యతిరేకంగా జూన్ 20 న ఇచ్చిన బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా మావోలు ఇచ్చిన పిలుపు నేపధ్యంలో కేంద్ర భద్రతా బలగాలు పోలీసులు ఎలాంటి ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
………………………………………….