
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా (INDIA Vs AUSTRALIA) మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BOARDER GOVESAKAR TROPHY) తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ దెబ్బకు కంగారూలు విలవిలలాడారు. మ్యాచ్ ప్రారంభంలో ఇండియా విజయానికి ఇంకా 3 వికెట్లు అవసరం కాగా, ఆస్ట్రేలియా గెలవాలంటే 352 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 238 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ 89, మార్ష్ 47 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్(SIRAZ), బుమ్రా(BUMRA) చెరో 3 సుందర్ 2, నితీశ్రెడ్డి ఒక వికెట్ తీసి ఇండియా విజయానికి కారణమయ్యారు. 295 పరుగుల ఆధిక్యంతో టీమిండియా తొలి టెస్ట్ లో విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
……………………………………