
* రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం 31న
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 31న ప్రారంభం కానుండగా.. తొలిరోజు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా.. మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు రెండో విడుత సమావేశాలు కొనసాగుతాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెడుతారు.
………………………………………