
ఆకేరున్యూస్, హైదరాబాద్: నేడు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో భేటీ అయి రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లతో జిల్లాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
…………………………….