
* మరో జవానుకు గాయాలు
* కాల్పుల ఘటనపై స్పందించిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా మాద్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కాల్పులపై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ (DEPUTY CM VIJAY SARMA) స్పందించారు. నారాయణపూర్-బీజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందన్నారు. కూంబింగ్ లో భాగంగా పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు జరిగాయన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఎదురుకాల్పల్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందినట్లు తెలిపారు. మరో జవానుకు గాయాలు అయ్యాయని, ప్రాణాపాయం లేదని తెలిపారు.
………………………………….